అంబర్పేట, అక్టోబర్ 12 : బాగ్అంబర్పేట డివిజన్ చెంచు బస్తీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం రూ.12.50లక్షలతో కొత్తగా ఏర్పాటు చేయనున్న డ్రైనేజీ పైపులైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెంచు బస్తీలో పర్యటించినప్పుడు స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల్లో భాగంగానే నూతన డ్రైనేజీ పైపులైన్ను ఏర్పాటు చేయిస్తున్నాని పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే డ్రైనేజీ ఓవర్ఫ్లో సమస్య ఉండదని తెలిపారు. అలాగే రోడ్డు ప్యాచ్వర్కు పనులు, అవసరమైన చోట రోడ్ల నిర్మాణం, వీధి లైట్ల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు కూడా చేపడుతున్నామని చెప్పారు. అయితే బస్తీ వాసులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా చూసుకోవాలని సూచించారు. వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నందున ఇంటి ముందు, వెనుక చెత్త ఉంటే రోగాలు వస్తాయని, ఎప్పటికప్పుడూ చెత్తను తొలగించుకోవాలని అన్నారు. బస్తీలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తానని తెలిపారు. అభివృద్ధి పనుల్లో బస్తీవాసులు కూడా భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం శ్రీధర్రెడ్డి, డీజీఎం విష్ణువర్ధన్రావు, మేనేజర్ మాజిద్, వర్క్ ఇన్స్పెక్టర్లు బాలకృష్ణ, లక్ష్మణ్, జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సుధాకర్,వర్క్ ఇన్స్పెక్టర్ రవి, ఏఈ అంబిక, సీపీఎం కన్వీనర్ ఎం. మహేందర్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, సీనియర్ నాయకులు శ్రీరాములుముదిరాజ్, బంగారు శ్రీను, కోట్ల సంతోష్, పంజాల చంద్రశేఖర్, సునీల్, మిర్యాల రవీందర్, నవీన్యాదవ్, కె. శ్రీనివాస్, స్వామి, బీజేపీ నాయకులు చుక్క జగన్, ఎం.శ్రీనివాస్, చెంచు బస్తీ నాయకులు పాల్గొన్నారు.