అంబర్పేట, అక్టోబర్ 5 : విజయదశమిని పురస్కరించుకొని (టీఆర్ఎస్)ను జాతీయ పార్టీ బీఆర్ఎస్(భారత్ రాష్ట్రీయ సమితి)గా మారుస్తూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటన చేయడంతో అంబర్పేట నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. అదేవిధంగా బీఆర్ఎస్ భవన్లో మంత్రి కేటీఆర్తో కలిసి ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్, దానం నాగేందర్లు సంబురాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట డివిజన్లలో మిఠాయిలు పంచి టపాకులు కాల్చారు. దేశ్కీ నేత కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కాచిగూడ డివిజన్లో ఆ పార్టీ అధ్యక్షుడు భీష్మాదేవ్, డాక్టర్ శిరీషాయాదవ్ల ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
జై కేసీఆర్, దేశ్కీ నేత కేసీఆర్, జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఓంప్రకాశ్యాదవ్, మాజీ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు, ఉద్యమకారుడు రవీందర్యాదవ్, నాయకులు సదానంద్, కృష్ణాగౌడ్, నర్సింగ్రావు, బాబు, బాబ్జి, సూర్యారావు, మహేశ్, శేషు, అనిల్కుమార్, రాజేశ్, విజయ్, కిషొర్, అశోక్, నిఖిల్, భాస్కర్, రమేశ్, లక్ష్మణ్, క్రాంతి, నాగరాజుగౌడ్, శ్రీకాంత్యాదవ్, శ్రీశైలం, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. నల్లకుంట డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్ ఆధ్వర్యంలో ఫీవర్ దవాఖాన చౌరస్తాలో కూడా మిఠాయిలు పంచి టపాకులు కాల్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేందర్, భాస్కర్గౌడ్, గాలపల్లి శంకర్, రాముయాదవ్, సత్యనారాయణ, విజయేంద్రసాగర్, వీరయ్య, సతీశ్చంద్ర, గులాబ్ సతీశ్నాయక్, ప్రదీప్, హరిబాబు, కాఖా, యూసుప్, చంద్రకాంత్, రేణుక, అనిత తదితరులు పాల్గొన్నారు.
గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. టపాకులు కాల్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ భారత్ రాష్ట్రీయ సమితి మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లాలని, యావ్ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ర్టాల ప్రజలు కోరుకునే విధంగా సీఎం కేసీఆర్ పార్టీని తీర్చిదిద్దుతారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కొమ్ము శ్రీను, నాయకులు ఆర్కేబాబు, భూపతి లక్ష్మణ్, బి.లింలంగౌడ్, బి.నర్సింగ్రావుయాదవ్, లింగంయాదవ్, పల్లవి, ఉమా, రాజు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్ నేతృత్వంలో పటేల్నగర్ చౌరస్తాలో భారత్ రాష్ట్రీయ సమితి ఆవిర్భావం సందర్భంగా ప్రజలకు స్వీట్లు పంచి బాణాసంచా కాల్చా రు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు రామారావుయాదవ్, ఎ.సతీష్, మల్లేష్యాదవ్, సింగజోగి శ్రీనివాస్, నాగరాజు, దయాకర్యాదవ్, మల్లికార్జున్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బాగ్అంబర్పేట డివిజన్లోని రెడ్బిల్డింగ్ చౌరస్తాలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు జై కేసీఆర్, జై బీఆర్ఎస్ అంటూ నినాధాలు చేస్తూ మిఠాయిలు పంచి సంబురాలు జరుపుకున్నారు. నాయకులు డా.ఎస్.సులోచన, భాస్కర్గౌడ్, అరున్కుమార్రెడ్డి, మిర్యాల రవీందర్, ఇ.ఎస్. ధనుంజయ, దిలీఫ్, అఫ్రోజ్పటేల్, శివాజీయాదవ్, దారయోబు, శ్రీనివాస్యాదవ్, రమేశ్నాయక్, రాజేశ్, సంపత్, మీసాల నర్సింగ్రావు, బొట్టు శ్రీను, ఉప్పు సుధాకర్, ప్రవీణ్, జ్ఞానేశ్వర్, శరత్ పాల్గొన్నారు.