సిటీబ్యూరో, అక్టోబరు 4 (నమస్తే తెలంగాణ): ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు మంగళవారం నుంచి ఈ నెల 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సండోజి హెల్త్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, తెలంగాణ సైకాలజికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అందరికీ మానసిక ఆరోగ్య సంరక్షణ- అవగాహన అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. మానసిక ఆరోగ్య అవగాహన సదస్సుకు సంబంధించిన బ్రోచర్ను మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆవిషరించారు. మానసిక ఆరోగ్యం పట్ల అందరికీ అవగాహన ఉండాలని, వయసుతో సంబంధం లేకుండా ప్రశాంతమైన జీవన విధానాన్ని అనుసరించాలని కోరారు.
ఈ సందర్భంగా మానసిక నిపుణులు, రాష్ట్ర సైకాలజికల్ అసోసియేషన్ సభ్యులు చేస్తున్న కృషిని అభినందించారు. తెలంగాణ సైకాలజికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడుడాక్టర్ ఎం.ఏ.కరీం మాట్లాడుతూ.. కరోనా తర్వాత చాలా మందిలో మానసిక పునరుత్తేజశక్తి సామర్థ్యాలు తగ్గాయని, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ బారిన పడకుండా ఉండేందుకు వీలుగా మానసిక ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అస్తవ్యస్తమైన ఆలోచనలతో ఆందోళనకు గురికావద్దని, తీరికలేని పనులతో మానసిక ప్రశాంతతని కోల్పోతున్నారని, మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం ఉంటుందని అయన అన్నారు. వ్యక్తిగత మానసిక సమస్యల పరిషారం కోసం 9440488571లో సంప్రదించాలని సైకాలజిస్ట్ డాక్టర్ కరీం కోరారు. ఈ కార్యక్రమంలో సండోజి హెల్త్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రతినిధి ఫర్జాన్ సయ్యద్ అసారి, మానసిక నిపుణుల బృందం సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.