సిటీబ్యూరో, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి లాల్ బహద్దూర్ శాస్త్రి జయంతి వేడుకలు నగర వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పలువురు పూలమాల వేసి ఘనంగా నివాళుర్పించారు. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో వారి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు.
జాతి పిత మహాత్మా గాంధీ,మాజీ ప్రధాన మంత్రి లాల్ బహద్దూర్ శాస్త్రి జయంతులను పురసరించుకొని ఆదివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.కార్యక్రమంలో ఈఎన్సీ జియా ఉద్దీన్, అడిషనల్ కమిషనర్లు విజయ లక్ష్మి, యాదగిరి రావు చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ మొహ్మద్ అబ్దుల్ వకీల్ , సీపీఅర్ఓ మొహ్మద్ ముర్థుజా, పీఅర్ఓ జీవన్ తదితరులు పాల్గొన్నారు.
గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆదివారం మెట్రోపాలిటన్ మోహన్స్ డయాబెటీస్ స్పెషలిస్ట్ సెంటర్ సమన్వయంతో బీకేగూడలోని సీనియర్ సిటిజెన్ కౌన్సిల్లో మెడికల్ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమంలో మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైశ్వాల్, సీనియర్ సిటిజెన్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ అభినవ్,పారా లీగల్ వలంటీర్లు సత్యనారాయణరాజు, అనంతరెడ్డి, పార్థసారిథి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
యూసుఫ్గూడ టీఎస్ఎస్పీ ప్రథమ పటాలంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ ఏకే మిశ్రా, అసిస్టెంట్ కమాండెంట్లు జె.రాందాస్, రంగారెడ్డి, కేపీ సత్యనారాయణ, బి.జవహర్లాల్, ఆర్ఐలు ఎస్.సురేశ్, టి.సాంబయ్య, ఎండీ.జాఫర్, ఆర్.శంకర్, పి.సురేశ్, టి.రాజేశం, ఆర్ఎస్ఐలు, బెటాలియన్ సిబ్బంది.