ముషీరాబాద్/చిక్కడపల్లి/కవాడిగూడ, అక్టోబర్ 1: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు డివిజన్ వ్యాప్తంగా కన్నులపండువగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసిన భక్తిభావంతో ఆధ్మాత్మిక శోభ కనబడుతోంది. చిక్కడపల్లి వివేక్నరగ్లోని ఆంజనేయస్వామి దేవాలయంలో ఆలయ నిర్వాహకులు భువనేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం గాయత్రీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చా రు. దేవాలయం పునర్ నిర్మాణ కమిటీ చైర్మన్ గుండెపూడి మురళీప్రసాద్, ఈవో మాచర్ల దేవనాధంలు కార్యక్రమాలు పర్యవేక్షించారు. అలాగే అన్న ప్రసాద వితరణ జరిగింది.
శనివారం రాంనగర్ రామాలయంలో అమ్మవారు మహాలక్ష్మీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రాంనగర్ గుండు అభయాంజనేయ స్వామి ఆలయంలో జరుగుతున్న వేడుకల్లో అమ్మవారు శాకాంబరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు, కుంకుమార్చనలు నిర్వహించారు.
గంగపుపుత్ర కాలనీలో ఓం గంగాభవానీ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్, కమలానెహ్రూనగర్లో జరుగుతున్న శరన్నవరాత్రి వేడుకల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, టీ.సోమసుందర్, నర్సింగ్ ప్రసాద్, ఆకుల అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని లక్ష్మీ గణపతి దేవాలయంలో శనివారం అమ్మవారు లలితాదేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయంలో రెనివేషన్ కమిటీ చైర్మన్ ప్రభాకర్, ఈవో పి.లక్ష్మారెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు.
గాంధీనగర్ డివిజన్ జవహర్నగర్లోని నల్ల పోచ మ్మ, ఉప్పలమ్మ సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో శనివారం అమ్మవారు మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో దేవాలయం ధర్మకర్త బి.సాయికీర్త్, సలహాదారుడు నర్సింగ్ రావు, ఎస్.ప్రభాకర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
గాంధీనగర్లోని వై జక్షన్ చౌరస్తా ‘జై షేరవాలి యూ త్ వెల్ఫేర్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారికి ప్రతి రోజు ఘనంగా పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు న్యాయవాది సాయి. ఇ.జగదీశ్, ఆనంద్, గణేశ్, శివకుమార్ పాల్గొన్నారు.
చిక్కడపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం వీధి లో ‘నేతాజీ ఫెండ్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారు శనివారం కాళికాదేవిగా అలంకరణలో దర్శనం ఇచ్చారు. కల్యాణానంద పీఠాధ్యక్షుడు ఆచార్య డాక్టర్ హనుమంతరాయ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ బాల్రాజ్గౌడ్, అసోసియేషన్ సభ్యులు కృష్ణ, రాజగోపాల్, చందర్ పాల్గొన్నారు.
గాంధీనగర్ జవహర్నగర్ యంగ్మెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం లో శనివారం అమ్మవారు లలితా దేవిగా దర్శనం ఇచ్చారు. రాజ్యసభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్లుఎ.పావని, రచన శ్రీ, మాజీ కార్పొరేటర్ అరుణ దర్శించుకున్నారు. నిర్వహకులు జయేంద్ర బాబు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
శనివారం కవాడిగూడ డివిజన్లోని లోయర్ ట్యాంక్బండ్ కనకాల కట్టమైసమ్మ దేవాలయంలో లలితాదేవి, భోలక్పూర్ డివిజన్లోని మహంకాళి దేవాలయం గాయిత్రీ దేవి, దేవునితోటలోని భవానీ శంకర్ దేవాలయంలో రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దుర్గామాత అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
ముషీరాబాద్ మహంకాళి దేవాలయంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రెబ్బ రామారావు హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్లు గౌతమ్కుమార్ పటేల్, ఎయిర్టెల్ రాజు, శ్రీనివాస్, కట్టమైసమ్మ, మహంకాళి దేవాలయం కార్యనిర్వహణాధికారి కే. సాంబశివరావు, ఆలయాల పూజారులు తదితరులు పాల్గొన్నారు.
అడిక్మెట్లో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ నేత ఎంఎన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.