హిమాయత్నగర్,అక్టోబర్1:దసరా సందర్భంగా ‘నమస్తే తెలంగాణ- తెలంగాణటుడే’ సంయుక్తంగా నగర వాసుల కోసం తీసుకొచ్చిన పది రోజులు బొనాంజా పండుగ ముగిసింది. లక్డీకాపూల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్యాలయంలో శనివారం పలువురు వినియోగదారుల సమక్షంలో బ్యాంక్ జోనల్ హెడ్ మహ్మద్ మక్స్ద్ అలీ లక్కీ డ్రా తీసి ఐదుగురు విజేతలను ఎంపిక చేశారు.మొదటి బహుమతి జి.రఘు,రెండో బహుమతి జ్యోతి, మూడో బహుమతి మహ్మద్ ఇంద్రేస్,నాలుగో బహుమతి ఆజార్,ఐదో బహుమతి జి.దివ్య గెలుచుకున్నారు.కార్యక్రమంలో ‘నమస్తే తెలంగాణ,తెలంగాణ టు డే’ జనరల్ మేనేజర్ ఎన్.సురేందర్ రావు, హోఫ్ అడ్వర్టయిజింగ్ లిమిటెడ్ డైరెక్టర్ కెఎస్రావు, డిప్యూటీ మేనేజర్ సంజురావు పాల్గొన్నారు.
ఖాతాదారులకు మెరుగైన సేవలు
బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే నిర్వహించే దసరా బొనాంజాలో తాము భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది.తెలంగాణ వ్యాప్తంగా 131 బ్రాంచీలు ఉండగా హైదరాబాద్లోనే 75 బ్రాంచీలు ఉన్నాయి. దసరా సందర్భంగా బ్యాంకు గృహ,కారు లోన్లు తీసుకునే ఖాతాదారులకు చాలా తక్కువ రెట్లకు అందజేస్తున్నాం. ఈ బొనాంజాలో విజేతలైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. –పంజాబ్ నేషనల్ బ్యాంక్ జోనల్ హెడ్ మహ్మద్ మక్స్ద్ అలీ
ప్రజల నుంచి అనూహ్య స్పందన
నమస్తే తెలంగాణ -తెలంగాణ టు డేల ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనాంజాకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్, సీఎంఆర్, బిగ్సీ, కేఫ్ నీలోఫర్ సంస్థలు భాగస్వామ్యమై వారి సహకారం అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు.ఈ ఉత్సాహంతో భవిష్యత్తులో మరింత ఉన్నతంగా కార్యక్రమాలు చేపడుతాం. ఈ బొనాంజాలో పది రోజులుగా విజేతలైన ప్రతి ఒక్కరికీ అభినందనలు.
–అడ్వర్టయిజింగ్ ఏజీఎం రాజిరెడ్డి
భాగస్వామ్యం కావడం సంతోషం
నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బొనాంజాలో భాగస్వామ్యం కావడం సంతోషం.ఈలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు కలిగిస్తాయి.బ్యాంకు సేవలను మరింత విస్తరించి క్షేత్ర స్థాయిల్లో ప్రజలకు సేవలకు అందించేందుకు కృషి చేస్తున్నాం. –పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏజీఎం సీ.వీ రావు,
చాలా సంతోషంగా ఉంది..
నమస్తే తెలంగాణ-తెలంగాణటు డే ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా బోనాంజాలో బహుమతి గెలుచుకోవడం ఆనందంగా ఉంది. పండుగ కోసం వస్ర్తాలను కొనుగోలు చేశాక కేఎల్ఎం సిబ్బంది కూపన్ ఇచ్చారు. నమస్తే తెలంగాణ వారు ఫోన్ చేసి మొదటి బహుమతి గెలుచుకున్నట్లు చెప్పడంతో ఎంతో సంతోషం కల్గింది. నమస్తే తెలంగాణ దినపత్రిక యాజమాన్యం దసరా బొనాంజా నిర్వహించి బహుమతులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు.
– మొదటి బహుమతి విజేత రఘు