పీర్జాదిగూడ, సెప్టెంబర్ 30 : ముంపు ప్రాంతాల శాశ్వత పరిష్కారానికి రూ. 110 కోట్ల నిధులతో చేపడుతున్న డ్రైనేజీ, వరదనీటి పైపులైన్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో.. భారీ వర్షాల కారణంగా జలమయమైన ముంపు ప్రాంతాలు భవానీనగర్, రాఘవేంద్రనగర్, మల్లికార్జున నగర్ కాలనీల్లో డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్తో కలిసి మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా కాలనీవాసుల సమస్యలసు అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రజలకు మంత్రి భరోసా ఇచ్చారు. అనంతరం కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న ఎస్ఎన్డీపీ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ స్వాతి కృష్ణగౌడ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పర్వతాపూర్ భవానీనగర్లోని శ్రీ కట్టమైసమ్మ దేవస్థానంలో నిర్వహించిన పూజల్లో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చంద్రారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.