ఎల్బీనగర్/మన్సూరాబాద్/వనస్థలిపురం, సెప్టెంబర్ 30: మన్సూరాబాద్ డివిజన్ పరిధి సీఆర్ ఎన్క్లేవ్లోని స్వయంభూ శ్రీ పోచమ్మ దేవాలయం, శ్రీసాయినగర్ కాలనీలోని శ్రీదుర్గాదేవి దేవాలయం, చంద్రపురికాలనీ కమ్యూనిటీ హాల్, సెంట్రల్ బ్యాంకు కాలనీలోని శ్రీ ఉమానాగలింగేశ్వర స్వామి దేవాలయం, సహారాస్టేట్స్కాలనీలోని శ్రీలలితా నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శుక్రవారం అమ్మవారిని శ్రీ లలితా దేవి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయంలో అమ్మవారికి ఫల, పంచామృత అభిషేకము, చతుషష్టి ఉపచార పూజలు, హవనము, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, వైస్చైర్మన్లు పోచబోయిన గణేశ్యాదవ్, నాంపల్లి శంకరయ్య, ప్రధాన కార్యదర్శి కొప్పుల ఉపేందర్రెడ్డి, కోశాధికారి రాజేందర్, సలహాదారుడు కొప్పుల జనార్దన్రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి నాంపల్లి క్రిష్ణ, సభ్యులు ఎం. ఈశ్వర్, బి. యాదయ్య యాదవ్, అమర్నాథ్ గౌడ్, గుర్రం వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
డివిజన్ హరిహరపురం కాలనీలోని త్రిశక్తి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదవరోజైన శుక్రవారం ముగ్గురమ్మలు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. మహాదుర్గా దేవి శ్రీ కాత్యాయని అలంకారంలో, మహా సరస్వతి దేవి శ్రీ అన్నపూర్ణగా, మహాలక్ష్మి దేవి శ్రీ ధాన్యలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలలో దేవస్థానం పాలకవర్గం విజయభాస్కర్, నారాయణరెడ్డి, రవిందర్కుమార్, వెంకటయ్య, ఈశ్వర్రావు పాల్గొన్నారు.
నియోజకవర్గం వ్యాప్తంగా శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో , మండపాల వద్ద నిత్యం హోమాలు నిర్వహించడంతో పాటుగా నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నాగోలులోని శ్రీ చండీశాక్తా మండల్ ఆధ్వర్యంలో నిత్యం హోమాలతో పాటుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిత్య అన్నప్రసాద వితరణ, సాయంత్రం సమయాల్లో అల్పాహారం వితరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బీఎస్ఎస్ఎఫ్ ఛైర్మన్ బస్వరాజు శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కందికంటి కన్నాగౌడ్, ప్రదీప్కుమార్, బొడ్డుపల్లి సురేష్, రావుల రాజు గౌడ్, మెండు వెంకట్రెడ్డి, ఉమామహేశ్వర్ గుప్త, పల్లె లింగం గౌడ్, సత్యనారాయణ, నవీన్కుమార్, సంజీవరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, జగన్నేత తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట ప్రసన్న మహాంకాళి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్ వజీర్ ప్రకాశ్గౌడ్ ఆధ్వర్యం లో పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. శుక్రవారం శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకరణలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. మోహన్నగర్ చిత్తారమ్మ దేవాలయంలోనూ శ్రీ దేవీ శర్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు స్కందమాతగా దర్శనం ఇచ్చారు.