మియాపూర్, సెప్టెంబర్ 27 : రెండు నియోజకవర్గాలను అనుసంధానం చేసే ఉషాముళ్లపూడి రహదారిని 100 ఫీట్లకు విస్తరించి ప్రజలకు అంతరాయంలేని ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు. పనులలో జాప్యం లేకుండా త్వరిత గతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఉషాముళ్లపూడి కమాన్ నుంచి గాజుల రామారం వరకు 100 ఫీట్ల రోడ్డు విస్తరణకై ఇంజినీరింగ్, విద్యుత్, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ విభాగాలు సహా కార్పొరేటర్లు వెంకటేశ్ గౌడ్, శ్రీనివాస్రావు, మాజీ కార్పొరేటర్ రంగారావులతో కలిసి విప్ గాంధీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ దారిని సౌకర్యవంతంగా విస్తరిస్తున్నామన్నారు. రహదారి విస్తరణకు విద్యుత్ స్తంభాలు సహా ఇతర ఏ ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని విప్ సూచించారు. ఆయా విభాగాలు సమన్వయంతో పని చేసి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గాంధీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ గోవర్ధన్, ఏఈ సుభాష్, ఏసీపీ ఇర్షాద్, టీపీఎస్సోమేశ్, ఏఈ విశ్వం, ఏఈ షాబాద్, మృదుల, పార్టీ నేతలు పాల్గొన్నారు.
పనులు పరిశీలన..
ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండలో రూ.4.50 కోట్లతో చేపడుతున్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటికలో అభివృద్ధి, సుందరీకరణ పనులను కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్తో కలసి విప్ గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాటికల నిర్మాణ పనులలో నాణ్యతను పాటించాలని సకాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. శ్మశాన వాటికను మహాప్రస్థానం స్థాయిలో అభివృద్ధి పరుస్తున్నట్లు, అంతర్గత రహదారులు, టాయిలెట్లు, తాగునీరు సహా ఇతర పూర్తి స్థాయి వసతులను కల్పిస్తున్నట్లు గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నేతలు సమ్మారెడ్డి, సంజీవరెడ్డి, గణేశ్, భాస్కర్, కాశీనాథ్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
సహాయనిధి అందజేత..
కూకట్పల్లి డివిజన్ ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన హలీమ బేగంకు సీఎం సహాయనిధి పథకం కింద మంజూరైన రూ. 30 వేల ఆర్థిక సాయాన్ని కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్తో కలసి విప్ గాంధీ తన నివాసంలో అందించారు.