బడంగ్పేట, సెప్టెంబర్ 27: దేశంలో ఎక్కడా లేని విధంగా రజకుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందన చెరువు కట్టపై ఏర్పాటు చేసిన తెలంగాణ వీర నారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భగా మంత్రి మాట్లాడుతూ.. రజకుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దోబీఘాట్ల ఏర్పాటు, ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. వెనుక బడిన రజకుల కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకార్యాలను రజకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ఎవరూ మర్చి పోకూడదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను రజకుల ఆశీర్వాదం ఉండాలన్నారు. చాకలి ఐలమ్మను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ సీహెచ్ నాగేశ్వర్, డీఈఈ గోపీనాథ్, కార్పొరేటర్లు అర్కల భూపాల్ రెడ్డి, పెండ్యాల నర్సింహ, సిద్దాల లావణ్యా బీరప్ప, కర్ణా నిధి, పద్మా భాస్కర్ రెడ్డి, గజ్జల రాంచందర్, నవీన్ గౌడ్, కో-ఆప్షన్ సభ్యులు పల్లె జంగయ్య, రజాక్, రజక సంఘం నాయకులు ఆశన్న మల్లేశ్, పి.జోజి, చెన్నయ్య, బాల్రాజ్, పెండ్యాల ఉమేశ్, సత్యనారాయణ, రాజేశ్, టీఆర్ఎస్ పార్టీ మీర్పేట కార్పొరేషన్ అధ్యక్షుడు అర్కల కామేశ్ రెడ్డి, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కోఆప్షన్ సభ్యులు తదితరులు ఉన్నారు.