అబిడ్స్, సెప్టెంబర్ 25: దేవీ నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో గర్భా దాండియా కార్యక్రమాలను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఘనంగా నిర్వహించనున్నట్లు రామాయణ్ మేళా చీఫ్ కన్వీనర్ గోవింద్రాఠి, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు వినయ్కుమార్, సురేందర్రెడ్డి, రాజస్తాని ప్రగతి సమాజ్ అధ్యక్షుడు కమల్నారాయణ్ అగర్వాల్, సుమిత్రాఠి పేర్కొన్నారు. ఎగ్జిబిషన్ మైదానంలో గర్భా దాండియా పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ నెల 29 నుంచి అక్టోబర్ మూడో తేదీ వరకు గర్భాదాండియా కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ప్రతి రోజు రాత్రి ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు దాండియా నృత్యాలు ఆడేందుకు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. రామాయణ్ మేళా ఘట స్థాపన కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విజయదశమి రోజున రావణ దహనం, శ్రీరాముని పట్టాభిషేకం వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు.