సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గురువారం గ్రేటర్ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సాయంత్రం పెద్దఎత్తున ఉరుములు, మెరుపులతో కురిసిన వానతో నగరం తడిసి ముైద్దెంది. రాత్రి 10 గంటల వరకు గ్రేటర్లోని కాప్రాలో 8.03 సెం.మీ,మల్కాజిగిరిలో 7.4 సెం.మీ, సికింద్రాబాద్, ఖైరతాబాద్లో 6.7 సెం.మీ, షేక్పేట్లో 6.1 సెం.మీ, కుత్బుల్లాపూర్లో 5.8 సెం.మీ, కూకట్పల్లిలో 5.7 సెం.మీ, ముషీరాబాద్లో 4.9 సెం.మీ, నాంపల్లిలో 3.7 సెం.మీ.ల వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు.