కీసర/మేడ్చల్ కలెక్టరేట్,ఆగస్టు 24: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల నడ్డివిరిచిందని, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మత ఘర్షణ సృష్టిస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం పట్టణం,దమ్మాయిగూడ మున్సిపాలిటీలో కల్యాణలక్ష్మి, సీఎంరిలీఫ్ ఫండ్,పింఛన్ లబ్ధిదారులకు చెక్కులు, కార్డులను అందజేశారు.పింఛన్ కార్డులు 48 మందికి, కల్యాణలక్ష్మి చెక్కులు 34 మందికి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నలుగురికి అందించారు. అదే విధంగా కీసర మండలంలోని పలు గ్రామాలకు చెందిన 51మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంరిలీఫ్ఫండ్ లబ్ధిదారు లకు చెక్కులను మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంశవాలు, పాలపై జీఎస్టీ విధించి పేదలపై పెను భారాన్ని మోపుతుందన్నారు. బీజేపీ నేతలు పాదయాత్రల పేరుతో టీఆర్ఎస్ నేతలపై దాడి చేస్తున్నారని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ భారీ మోజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకుల పాఠశాలలు,24గంటల కరెంట్, సాగునీరు, రైతుబంధు, బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పింఛన్లు, దళితబంధు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.
తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్ర్టాల్లో అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జవహర్నగర్, దమ్మాయిగూడ, నాగారంలో ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్ యా ర్డుతో స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులు గుర్తించిన సీఎం కేసీఆర్ రూ. 144కోట్లలో దుర్వాసన రాకుండా ట్యాపింగ్ చేస్తున్నారని దాంతో కాలుష్యం, వాసన పూర్తిగా తగ్గిందన్నారు. రోడ్ల్ల మరమ్మ తుల కోసం మున్సిపాలిటీలకు అధిక నిధులు సీఎం మం జూరు చేశారని అన్నారు.
నాగారం మున్సిపాలిటీలో లింక్ రోడ్ల అభివృద్ధికి రూ. 209 కోట్లు కేటాయించామని, వర్షాలతో దెబ్బతిన్న నాగారంరోడ్డుకు రూ. 9.90కోట్లు, దమ్మాయిగూడకు రూ. 55కోట్లు, దమ్మాయిగూడలో రూ. 7 కోట్లతో సీవరేజీ పైప్లైన్ పనులు పూర్తి చేశామని దమ్మాయిగూడ 8వ వార్డు నుంచి నాగారానికి చర్లపల్లి వరకు రూ. 8కోట్లు కేటాయిస్తున్నామన్నారు. నాగారంకు 700 మందికి దమ్మాయిగూడకు 550మందికి పింఛన్ల్లు మం జూరు చేసిందని చెప్పారు.
గ్రామాల్లోని సర్పంచ్లు, ఎం పీటీసీలు, టీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లి భారీ ఎత్తున ప్రచారం చేసి ప్రభుత్వ ప్రతిష్ట ను పెంచాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, మున్సిపల్ చైర్మన్లు చంద్రారెడ్డి, కమిషనర్లు వాణిరెడ్డి, వైస్ చైర్మన్లు మల్లేశ్యాదవ్, నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కీసర ఎంపీపీ
ఇందిరలక్ష్మీనారాయణ,వైస్ఎంపీపీజె.సత్తిరెడ్డి,సర్పంచ్లు వెం కటేశ్,మహేందర్రెడ్డి,ధర్మేందర్, రాజుముదిరాజ్, పెం టయ్య, విమలనాగరాజు, ఎంపీడీవో పద్మావతి, తహసీల్దార్ గౌరివత్సల, మండలఅధ్యక్షుడు సుధాకర్రెడ్డి ఎంపీటీసీలు కవిత, వెంకటేశ్, మండల కో-ఆప్షన్ సభ్యులు బాషరత్ ఆలీ,అధికారులు,నాయకులు పాల్గొన్నారు.