అమీర్పేట్, ఆగస్టు 19 : వజ్రోత్సవాల్లో భాగంగా అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి ఆధ్వర్యంలో అమీర్పేట్ ప్రభుత్వ దవాఖానలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కొలను బాల్రెడ్డి, కట్టా బలరాం, కూతురు నర్సింహ, సంతోష్ సరఫ్ పాల్గొన్నారు.
ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం..
జూబ్లీహిల్స్,ఆగస్టు19: ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. వజ్రోత్సవాల్లో భాగంగా పక్షం రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి శ్రీరాంనగర్ ప్రభుత్వ దవాఖానలో రోగులకు, ప్రసూతి మహిళలకు పండ్లు పంపిణీ చేశారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రమారాణి, వైద్య సిబ్బంది శిల్పారెడ్డి, సౌమ్య రెడ్డి, స్వాతి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నాగరాజు, షరీఫ్, ధనూజ, ఫయాజ్, చోటు, సాబేర్, గఫ్ఫూర్, ఒమర్, జగన్, లింగమూర్తి, విలియం, మహేశ్, రాము, లింగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
గాంధీ దవాఖానలో..
బన్సీలాల్పేట్, ఆగస్ట్ 19 : వజ్రోత్సవాల్లో భాగంగా గాంధీ దవాఖానలో డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శోభన్బాబు, ఆయా విభాగాల హెచ్ఓడీలు, నర్సులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం దవాఖాన ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. నర్సులు, నాలుగో తరగతి సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారని ఎంఎస్డబ్ల్యూ ప్రమీల తెలిపారు. ఈ పోటీలను డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, గైనిక్ హెచ్ఓడీ డాక్టర్ సంగీత, డాక్టర్ మహాలక్ష్మి పరిశీలించారు. త్వరలో బహుమతులను అందజేస్తారని తెలిపారు.
అనాథ ఆశ్రమంలో…
జీహెచ్ఎంసీ యూసీడీ విభాగం ఆధ్వర్యంలో అనాథ ఆశ్రమాలు, షెల్టర్ హోమ్లలో ఉంటున్నవారికి స్కై ఫౌండేషన్ సహకారంతో పండ్లు పంపిణీ చేశారు. బేగంపేట్ సర్కిల్ యూసీడీ డీపీవో నీరజాదేవి, సీఎంవో దయాకర్, యాదయ్య, స్కై ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ సంజీవ్ కుమార్, ఉపాధ్యక్షురాలు పావని పాల్గొన్నారు.
వెంగళరావునగర్లో…
వెంగళరావునగర్,ఆగస్టు19: యూసుఫ్గూడ సర్కిల్-19 కార్యాలయం ప్రాంగణంలో ఉన్న షెల్టర్ హోంలో నిరాశ్రయులకు కార్పొరేటర్ దేదీప్య విజయ్ పండ్లు,బెడ్షీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్-19 ఉప కమిషనర్ రమేశ్, ఏఎంసీలు నాగార్జున, ప్రేమ్కుమార్, జీటీఎస్ దేవాలయ చైర్మన్ చిన్న రమేశ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.