సిటీబ్యూరో, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: బంజారాహిల్స్లోని హరేకృష్ణ స్వర్ణ దేవాలయంలో ఈ నెల 18వ తేదీ నుంచి 20 వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకల సందర్భంగా భక్తులకు ప్రత్యేక అవకాశం కల్పించారు. శ్రీకృష్ణుడు మూడు విభిన్న రకాల రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్టు హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షులు సత్యగౌర చంద్ర దాస ప్రభూజీ వెల్లడించారు. కృష్ణుడు శ్రీరాధా గోవింద, శ్రీగోదాకృష్ణ, లడ్డు గోపాల్/వెన్నె కృష్ణుడు ఆకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు.
18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 వరకు దర్శనం చేసుకోవ చ్చు. మహాభిషేకం రాత్రి 7:30 గంటల నుంచి 9:30 వరకు ఉంటుంది. శుక్రవారం మహా అభిషేకం రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వ రకు, అర్థరాత్రి అభిషేకం రాత్రి 10 నుంచి తెల్లవారుజాము ఒంటి గంట వరకు ఉంటుంది. నందోత్సవం, వ్యాస పూజ ఉంటుందని వివరించారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 వరకు ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో 18, 19 తేదీలలో హెరిటేజ్ ఫెస్ట్ ఉంటుందని పేర్కొన్నారు.