వెంగళరావునగర్, ఆగస్టు 10: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, దళితుల బతుకులు బాగుపడుతున్నాయని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో బుధవారం దళితబంధు ద్వారా మంజూరైన వాహనాలను కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్యాదవ్తో కలిసి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ అనాదిగా వివక్షకు, నిరాధరణకు గురైన ఎస్సీల జీవితాలను మెరుగుపర్చేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని రూపకల్పన చేశారని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలుచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అప్పూఖాన్, నాయకులు మధు, సంతోష్, మారుతి, నర్శింగ్, మోహన్, సత్యనారాయణ, శివ, శిరీష, లబ్ధ్దిదారులు వాణి, జగన్, కపిల్ పాల్గొన్నారు.