సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పది కీలకమైన అంశాలకు ఆమోదం లభించింది. గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యుల సహకారంతో కమిటీ సమావేశంలో పది అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపినట్లు ఆమె తెలిపారు. సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు పన్నాల దేవేందర్రెడ్డి, మహ్మద్ అబ్దుల్ సలాం షాహిద్, పర్వీన్ సుల్తానా, సామల హేమ, విజయ్కుమార్గౌడ్, మహ్మద్ రషీద్ ఫరీదుద్దీన్, సీఎన్రెడ్డి, మందడి శ్రీనివాస్రెడ్డి, రావుల శేషగిరి, ప్రేమ్కుమార్, గ్రేటర్ కమిషనర్ లోకేశ్కుమార్, కెనడీ, అర్బన్ బయోడైవర్సిటీ అడిషనల్ కమిషనర్ కృష్ణ, అడిషనల్ కమిషనర్ (పరిపాలన) సరోజ, ఈఎన్సీ జియావుద్దీన్, సీఈ దేవానంద్, చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్రెడ్డి, అడిషనల్ సీపీ శ్రీనివాస్, జోనల్ కమిషనర్లు శంకరయ్య, మమత, పంకజ, శ్రీనివాస్రెడ్డి, సామ్రాట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఆమోదం తెలిపిన అంశాలివే…