జవహర్నగర్, ఆగస్టు 9: సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం జవహర్నగర్ కార్పొరేషన్ పరిధి…25వ డివిజన్కు చెందిన వరమ్మ వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ. 50,500 చెక్కు మంజూరైంది. ఈ చెక్కును కార్పొరేటర్ జమాల్పూర్ నవీన్ సమక్షంలో మంత్రి మల్లారెడ్డి లబ్ధిదారురాలికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదలను అనారోగ్య సమయంలో సీఎం సహాయనిధి ఆదుకుంటున్నదన్నారు. కార్పొరేటర్ ఎడ్ల శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఉమ్మడి శామీర్పేట మండలానికి చెందిన వారికి..
శామీర్పేట, ఆగస్టు 9 : ఉమ్మడి శామీర్పేట మండలంలోని అలియాబాద్ గ్రామానికి చెందిన ఎం.శ్రీనివాస్కు రూ.65వేలు, యేల్లంకు రూ.45 వేలు, జగ్గంగూడ గ్రామానికి చెందిన కృష్ణవేణికి రూ.55 వేలు, పద్మకు రూ.12 వేలు మంజూరయ్యాయి. మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేసిన చెక్కులను లబ్ధిదారులకు సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ మండల మాజీ ప్రధాన కార్యదర్శి జగదీశ్గౌడ్ అందజేశారు. వార్డు సభ్యులు సాయిబాబు, భూపాల్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జంగారెడ్డి, రమేశ్, సాయిబాబు, మహేశ్, శివ, నరేందర్, జహంగీర్, నవీన్ పాల్గొన్నారు.
గుండ్లపోచంపల్లికి చెందిన లబ్ధిదారులకు..
మేడ్చల్ రూరల్, ఆగస్టు 9 : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ లక్ష్మీనగర్కు చెందిన మంగమ్మకు రూ.32,500, విజయలక్ష్మికి రూ.29వేలు, మానసకు రూ.32,505 సీఎం సహాయనిధి నుంచి చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను చైర్పర్సన్ లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్ రాములు, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు జైపాల్ రెడ్డి, హేమంత్ రెడ్డి, సరస్వతీ, హంసరాణి, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.