చార్మినార్, జూన్ 28 : పాతనగర వాసుల కల త్వరలో తీరనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఇక్కడి స్థానికుల వెతలు తీరనున్నాయి. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రయాణికులకు సేవలు అందిస్తున్న మెట్రో రైలు పరుగులు పాతనగర వాసులకు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో మెట్రో రైలు సేవలు విస్తరణ కోసం నిధులను కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో, ఇప్పటికే ఖరారైన మెట్రో మార్గంలో రెండు రోజులుగా ఇంజినీరింగ్ సిబ్బంది సర్వే పనులు ప్రారంభించింది. మరో వారం రోజుల్లో సర్వే పూర్తిచేసి, నిర్మాణ పనులను కొనసాగించనున్నామని మెట్రోరైలు ఇంజినీరింగ్ సిబ్బంది తెలిపారు.