ఉప్పల్జోన్ బృందం, జూన్ 10 : కాలనీలోని సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పట్టణ ప్రగతి కొనసాగుతుందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. మీర్పేట్ హెచ్బీకాలనీ ప్రదాన రహదారిలో శిథిలావస్థలో ఉన్న కమ్యూనిటీహాలు స్థలంలో మల్టీలెవల్ ఫంక్షణ్హాలు, క్రీడా ప్రాంగణం నిర్మించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన శుక్రవారం మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్లో కార్పొరేటర్ ప్రభుదాస్, డీసీ శంకర్, ఏఎంఓహెచ్ స్వప్నారెడ్డి, మాజీ కార్పొరేటర్ జి. శ్రీనివాస్రెడ్డిలతో కలిసి పర్యటించారు. ఈ కార్యక్రమంలో శానిటరి సూపర్వైజర్ నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు భాస్కర్రెడ్డి, హెచ్బీకాలనీ ఫేజ్-2 అధ్యక్షుడు కొంపల్లిమోహన్, బాల్రాజు, వెంకటాచారి, రాజేశ్, నవీన్గౌడ్, సాయికుమార్, చంద్రశేఖర్, సుఖేందర్రెడ్డి, భాగ్యమ్మ, భారతి పాల్గొన్నారు. నాచారం డివిజన్లో కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ శుక్రవారం అధికారులతో కలిసి పర్యటించారు.
చిలుకానగర్ డివిజన్లో బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టారు. మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గ్రీన్హిల్స్ కాలనీలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి అధికారులతో కలిసి పర్యటించి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి అభివృద్ధికి బాటలు వేస్తుందని ఏఎస్రావునగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషాసోమశేఖర్రెడ్డి పేర్కొన్నారు. నాయకులు సోమశేఖర్రెడ్డి, జలమండలి మేనేజర్ స్రవంతిరెడ్డి, సర్కి ల్ ఏఈ తిరుమల్లయ్య, శానిటిరీ సూపర్వైజర్ నాగరాజు, సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.