బడంగ్పేట, ఆగస్టు 12: స్వతంత్ర సమర యోధుల త్యాగాలు వెల కట్టలేనివని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండు రంగారెడ్డి పేర్కొన్నారు. బడంగ్పేటలోని జిల్లా గ్రంథాలయ భవనంపై అతి పెద్ద జాతీయ పథాకాన్ని ఆవిష్కరించారు. గ్రంథాలయ పితామహుడు ఎస్ఆర్ రంగనాథ్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కప్పాటి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు గ్రంథాలయాలపై జాతీయ జెండాను ఎగుర వేయడం జరిగిందన్నారు. గ్రంథాలయానికి వచ్చే వారికి జాతీయ జెండా గురించి వివరించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగుర వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మనోజ్ కుమార్, సత్యనారాయణ, జైహింద్, తదితరులు ఉన్నారు.
కందుకూరు, ఆగస్టు 12: వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద జాతీయ జెండాలను జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, తాసీల్దార్ ఎస్ జ్యోతి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీఎచ్ఓ విజయలక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు కొలను విజ్ఞేశ్వర్రెడ్డి, బొక్క దీక్షిత్రెడ్డి, అంజద్, చోటేజానీ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
పహాడీషరీఫ్, ఆగస్టు 12: ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని 17వ వార్డు కౌన్సిలర్ శ్రీధర్గౌడ్, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు కర్నాటి పద్మ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం జాతీయ జెండాలను పంపిణీ చేశారు.
ఈనెల 17న జరిగే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆంగోత్ రాజూనాయక్ పేర్కొన్నారు. శుక్రవారం మహేశ్వరం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఎంపీపీ రఘుమారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు బేరబాలకిషన్, అరవింద్ శర్మ, ఇతర నాయకులతో కలిసి మాట్లాడుతూ.. వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలతో మహేశ్వరం నియోజకవర్గం కేంద్రంలో జరిగే రక్తదాన శిబిరం, హెల్త్ క్యాంపును నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు హనుమగల్ల చంద్రయ్య, లక్ష్మీనర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్రెడ్డి, వైస్ చైర్మన్ ఆనందం, సీనియర్ నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు గోపాల్ నాయక్, బీసీసెల్ అధ్యక్షుడు రాఘవేందర్గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాదారం ఆంజనేయులు, పొట్టి ఆనందం, రవీందర్ నాయక్, మునగపాటి నవీన్, దుడ్డు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆంగోత్ రాజూనాయక్