కుత్బుల్లాపూర్ జోన్ బృందం, ఆగస్టు 12: నియోజకవర్గం వ్యాప్తంగా శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఇంటా ఆడపడుచుల సందడితో.. సోదరులకు రాఖీ కట్టి తమ బంధాలను కలిపిన వేళతో కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు. రాఖీలతో మార్కెట్లో దుకాణ సముదాయాలు మహిళ లు, చిన్నారులతో కిటకిటలాడాయి.
ఎమ్మెల్యే కేపీ కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజులకు తమ నివాసాల్లో పార్టీ మహిళా నేతలు, మహిళా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దుండిగల్ మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో అధికారులు, సిబ్బంది రాఖీలు కట్టుకొని వేడుకలను జరుపుకున్నారు.
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి, కమిషనర్ వంశీకృష్ణ, కార్పొరేటర్ విజయలక్ష్మితో పాటు కార్యాలయ అధికారులు, సిబ్బందితో కలిసి రాఖీ పండుగ వేడుకలను జరుపుకున్నారు.
కుత్బుల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్కు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కేఎం ప్రతాప్గౌడ్కు, జగద్గీరిగుట్ట కార్పొరేటర్ కొలుకుల జగన్, టీఆర్ఎస్ యూత్ నాయకులు కొలుకుల జైహింద్కు పార్టీ మహిళా నేతలు, సోదరీమణులు రాఖీలు కట్టి ఆత్మీయతను చాటుకున్నారు.