బేగంపేట్ ఆగస్టు 8: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసే లక్ష్యంతో తపాలా శాఖ అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారని ఆ శాఖ రైల్వే మెయిల్ సీనియర్ సూపరింటెండెంట్ సంతోష్నేత తెలిపారు. స్వతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని సోమవారం బేగంపేట విమానాశ్రయం నుంచి ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.
ఈ ర్యాలీలో సుమారు 300 మంది తపాలా ఉద్యోగులు పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి గ్రీన్ల్యాండ్స్, అమీర్పేట్ ప్రాంతాల్లో ద్విచక్రవాహన ర్యాలీ కొనసాగింది. వందేమాతరం, భారత్మాతాకీ జై అంటూ.. జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ పోస్టల్ ఉద్యోగులు ర్యాలీలో భాగస్వాములయ్యారు. పోస్ట్మాస్టర్ జనరల్ ఎం. శ్రీలత ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఇంటింటికీ రూ.25కే పోస్ట్లో జాతీయ పతాకాన్ని పంపిణీ చేస్తున్నట్లు సంతోష్నేత చెప్పారు. కార్యక్రమంలో నేషనల్ స్పీడ్ పోస్ట్ హబ్ మేనేజర్ శరత్కుమార్, ప్రచార సమన్వయకర్త ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.