హైదరాబాద్ : నగరంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలపై నగర కమిషనర్ అంజనీకుమార్ పోలీస్ అధికారులు, సిబ్బందితో సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిటీ ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఎలాంటి సమస్య వచ్చినా 100 నంబర్కు డయల్ చేయాలని సూచించారు. పెట్రోలింగ్, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.