సిటీబ్యూరో, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ): నగర పోలీస్ కమిషనరేట్ అధికారుల ఫోన్ నెంబర్లు బీఎస్ఎన్ఎల్ నుంచి ఎయిర్టెల్కు ఈ నెల 15వ తేదీ నుంచి మారనున్నాయి.
ఆగస్టు 1వ తేదీ నుంచి ఎయిర్టెల్ నెట్వర్క్లోకి మారాల్సి ఉన్నా, ఈ నెల 4వ తేదీన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనం ప్రారంభమవుతుండటంతో కొన్ని కార్యాలయాలు అక్కడకు మార్చాల్సి ఉండ టం, నగర పోలీస్ కమిషనర్తో పాటు అందరు అధికారులు ఇదే బిజీలో ఉన్నారు. ఈ క్రమంలోనే మరో 15 రోజుల వరకు పాత నెట్వర్క్లోనే ఉంటున్నారు.