హైదరాబాద్ : రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్లో బతుకమ్మ పండగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రంగు రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో ఉద్యోగినులు ఆడిపాడారు. దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించిన ఉద్యోగులు నవరాత్రి పూజలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు.
పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. డోబ్రియల్ ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూ మహిళలు బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవటం సంతోషంగా ఉందని డోబ్రియల్ అన్నారు. అరణ్య భవన్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, వివిధ సంఘాల ప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.