హైదరాబాద్, ఫిబ్రవరి 8: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.76.42 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది హైదరాబాద్కు చెందిన ఎన్సీసీ లిమిటెడ్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.71.20 కోట్లతో పోలిస్తే 10 శాతం వరకు అధికమైంది. సంస్థ ఆదాయం రూ.256.15 కోట్ల నుంచి రూ.276.38 కోట్లకు ఎగబాకినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. గత త్రైమాసికంలో మొత్తంగా రూ.4 వేల కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని పేర్కొంది. దీంతో డిసెంబర్ చివరినాటికి మొత్తం ఆర్డర్ల విలువ రూ.40 వేల కోట్లు. ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలానికి రూ.6,859 కోట్ల ఆదాయంపై రూ.246.97 కోట్ల లాభాన్ని గడించింది.