ట్రాఫిక్ చిక్కులు తప్పించి వాహనాలు సులువుగా రాకపోకలు సాగించేందుకు బల్దియా ప్రారంభించిన ఎస్ఆర్డీపీ పనులు ఒక్కోటి అందుబాటులోకి వస్తున్నాయి. నగరవ్యాప్తంగా ఇప్పటికే అనేక ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, ఆర్వోబీలు, ఆర్యూబీలు వినియోగంలోకి రాగా..కూకట్పల్లి-హైటెక్సిటీ మధ్య కైత్లాపూర్ వద్ద రూ.83 కోట్లతో నిర్మించిన రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణం పూర్తయ్యింది. సుమారు ముప్పావు కిలోమీటరు పొడవునా నిర్మించిన ఈ వంతెన అందుబాటులోకొస్తే సనత్నగర్, బాలానగర్, మూసాపేట ప్రాంతాల నుంచి హైటెక్సిటీకి ఈజీగా చేరుకోవచ్చు.
– సిటీబ్యూరో, జూన్ 9(నమస్తేతెలంగాణ)