మారేడ్పల్లి/అడ్డగుట్ట, జూన్ 9: స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, నిధుల మంజూరు కోసం తమ వంతు కృషి చేస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న తెలిపారు. గురువారం మోండా డివిజన్ రైల్నిలయం అంబేద్కర్నగర్ బస్తీలో పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగింది. ఈ సదర్భంగా జీహెచ్ంఎసీ, జలమండలి విభాగాలకు చెందిన వివిధ అధికారులతో కలిసి ఎమ్మెల్యే సాయన్న పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా బస్తీలో డ్రైనేజీ, రోడ్లు అస్థవ్యవస్థంగా ఉన్నాయని ఎమ్మెల్యేకు వివరించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్నగర్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న మట్టికుప్పలు, చెత్తాచెదారాన్ని జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. ఎమ్మెల్యే జి. సాయన్న మాట్లాడుతూ…వచ్చే వర్షాకాలం సీజన్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ ప్రవీణ్, ఆంజనేయులు, ఏఈ రవీందర్, జలమండలి సిబ్బంది, జీహెచ్ఎంసీ మాజీ కో ఆప్షన్ సభ్యుడు సీఎన్. నర్సింహముదిరాజ్, టీఆర్ఎస్ నాయకులు పిట్ల నాగేష్ ముదిరాజ్, టీఎన్ శ్రీనివాస్, సదానంద్, శేఖర్ ముదిరాజ్, రాము, నారాయణ ఉపేందర్, రౌతు రాజయ్య, భాస్కర్ ముదిరాజ్, మహిళా నాయకులు నివేదిత, శివకుమారి పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా తుకారాంగేట్లోని గడ్డమీది బసీ, గోల్బావి, కొండారెడ్డి పార్కు, ఎమ్సీహెచ్ క్వార్టర్స్ ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి వివిధ విభాగాల అధికారులతో కలిసి పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ…. పట్టణ ప్రగతితో బస్తీల్లో అభివృద్ధి పనులు జోరందుకున్నాయని అన్నారు. ఇప్పటికే చాలా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికై సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేయడం జరిగిందని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర గ్రంథాలయ డైరెక్టర్ లింగాని శ్రీనివాస్, జీహెచ్ఎంసీ ఏఈ వేణు, ఎలక్ట్రికల్ ఏఈ రాజేష్, జలమండలి ఏఈ కృష్ణప్రసాద్, పార్టీశ్రేణులు సత్తయ్య గౌడ్, వసంత, ప్రవీణ్, అంజయ్య, పొన్నాల రాజు, మనోజ్, వడ్లూరి రవి, మహేశ్వరితో పాటు తదితరులు పాల్గొన్నారు.