జమ్మికుంట పట్టణ ఇన్చార్జి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ విస్తృత ప్రచారం
హుజూరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో జమ్మికుంట అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని జమ్మికుంట పట్టణ ఇన్చార్జి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. శనివారం ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని 14వ వార్డులో స్థానిక కౌన్సిలర్ సుగుణావెంకటేశ్తో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
వార్డులోని అన్ని వీధులను కలియతిరిగి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, వెంటనే ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. అనారోగ్యంతో ఉన్న పలువురికి ఆయన ఆర్థిక సాయాన్ని అందించారు. దవాఖానల్లో మాట్లాడి మెరుగైన వైద్యం అందిస్తానని హామీ ఇచ్చారు. పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలకు వివరించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తమ ఓటు టీఆర్ఎస్కే అంటూ పలువురు స్థానికులు ఎమ్మెల్యే ముందు స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు, ఇన్చార్జులు, యువజన నాయకులు , మహిళలు పాల్గొన్నారు.