వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను చెట్టుకు కట్టేసి కొట్టాడో భర్త. ఈ దారుణ ఘటన రాజస్థాన్లో వెలుగు చూసింది. బస్వారా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి తన భార్యపై అనుమానం వచ్చింది. తన స్నేహితుడితోనే ఆమె ఎఫైర్ పెట్టుకున్నట్లు అతనికి అనుమానం వచ్చింది. దీంతో భార్యను ఒక చెట్టుకు కట్టేసి సుమారు ఏడు గంటలపాటు హింసించాడు.
ఈ ఘటన గురించి తెలిసిన జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) వెంటనే సదరు భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు రాజస్థాన్ డీజీపీకి లేఖ రాసింది. ఈ విషయంలో కలుగజేసుకొని నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.