హైదరాబాద్ : భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని కాచిగూడ పరిధి గోల్నాకలో చోటుచేసుకుంది. మృతుడిని కోనేటి శివకుమార్గా గుర్తించారు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. శివకుమార్కు ఆరేళ్లక్రితం పళ్లైంది. కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. దంపతులకు సంతానం లేదు. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గొడవలు పెరిగి భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్థాపానికి గురై ఉరేసుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.