బుఢాన్పూర్: భార్యపై అమితమైన ప్రేమతో ఒక వ్యక్తి తాజ్మహల్ వంటి కట్టడం నిర్మించాడు. దాన్ని భార్యకు బహుమతిగా అందించాడు. ఆనందర్ ప్రకాష్ ఛోక్సీ అనే వ్యక్తి మధ్యప్రదేశ్లోని బుఢాన్పూర్లో ఉంటున్నాడు. అతనికి తాజ్మహల్ అంటే చాలా ఇష్టం. షాజహాన్ భార్య ముంతాజ్ చనిపోయింది మధ్యప్రదేశ్లో అయితే.. తాజ్మహల్ ఆగ్రాలో ఎందుకు కట్టారని అతను చాలాసార్లు అనుకున్నాడట.
అందుకే తన భార్య కోసం తాజ్మహల్ వంటి ఇల్లు కట్టించాలని నిర్ణయించుకున్నాడు. ఒక ఇంజనీరును పిలిపించి తన కోరిక చెప్పాడు. దానికి సరేనన్న ఆ ఇంజనీరు తాజ్మహల్ను క్షుణ్ణంగా పరిశీలించి, ఒక డిజైన్ తయారుచేశాడు. పశ్చిమబెంగాల్, ఇండోర్ నుంచి శిల్పులను తెప్పించి ఆ భవనం లోపల డిజైన్ చేయించారు. ముప్ఫై అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ భవన నిర్మాణానికి మూడేళ్ల సమయం పట్టింది.
భవనంలో ఏర్పాటు చేసిన ఫర్నీచర్ను ముంబైలోని పనివాళ్లు తయారుచేశారట. ఒక పెద్ద హాలు, కింది అంతస్థులో రెండు బెడ్రూంలు, పైఅంతస్థులో రెండు బెడ్రూలు, ఒక లైబ్రరీ, ఒక మెడిటేషన్ గది ఉండేలా ఈ భవనాన్ని డిజైన్ చేశారు. చీకట్లో ఒరిజినల్ తాజ్మహల్ మెరిసినట్లే వెలుగులు విరజిమ్మేలా ఈ భవనంలో లైటింగ్ను ఏర్పాటు చేశారు. కాగా, షాజహాన్ భార్య ముంతాజ్ మహల్.. బుఢాన్పూర్లోనే 14వ బిడ్డకు జన్మనిస్తూ కన్నుమూసింది.