మంచిర్యాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోటపల్లి మండలం ఎడగట్ట గ్రామానికి చెందిన చికినం కిష్టయ్య అనే వేటగాడు తాను అమర్చిన విద్యుత్ తీగ తగిలి మరణించాడు. మంగళవారం రాత్రి వన్యప్రాణుల వేట కోసం ఎడగట్ట గ్రామం అటవీ సమీపంలోని నీటికుంట చుట్టూ విద్యుత్ తీగ అమర్చాడు. రాత్రి సమయంలో నీటి కుంట చుట్టూ తిరుగుతుండగా విద్యుత్ తీగ తగలడంతో అక్కడికక్కడే మరణించాడు.
బుధవారం ఉదయం ఇది గమనించిన గ్రామస్తులు పోలీస్ లకు సమాచారం అందించగా సంఘటన స్థలంకు చేరుకొని వివరాలు సేకరించారు. చనిపోయిన వేటగాడి వెంట మరో ఇద్దరు వేటగాళ్లు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.