కేప్ టౌన్: ఒక ఉత్పత్తి కేంద్రం నుంచి పెద్ద సంఖ్యలో మొసళ్లు మాయమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, పర్యావరణ శాఖ సిబ్బంది వాటిని పట్టుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. దక్షిణ ఆఫ్రికాలో బుధవారం ఈ ఘటన జరిగింది. రాజధాని కేప్ టౌన్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేప్ వైన్ల్యాండ్స్ జిల్లాలో మొసళ్ల ఉత్పత్తి, పెంపకం కేంద్రం ఉన్నది. ఆ మొసళ్ల ఫార్మ్ ఫెన్సింగ్కు పెద్ద రంద్రం ఉన్నట్లు బుధవారం ఉదయం సిబ్బంది గుర్తించారు. దాని గుండా పలు మొసళ్లు తప్పించుకున్నట్లు గ్రహించారు.
నాలుగు నుంచి ఐదు అడుగుల పొడవైన యంగ్ నైలు మొసళ్ల మిస్సింగ్పై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఒక పత్ర్యేక బృందాన్ని ఏర్పాటు చేసి మొసళ్ల కోసం గాలిస్తున్నారు. పర్యావరణ అధికారులు, ఫార్మ్ సిబ్బంది కలిసి 27 మొసలి పిల్లలను నిర్బంధించారు. బ్రీడ్ నది పరిసరాల్లో మరికొన్ని దాగి ఉంటాయని భావిస్తున్నారు. వాటిని పట్టుకునేందుకు ట్రాప్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.