లఖింపూర్ ఖీరీ: మానవత్వం మంటగలిసింది. ఇటీవల ఉత్తరప్రదేశ్లో రక్తపు మడుగులో కొట్టిమిట్లాడుతున్న బాలిక తనను రక్షించాలంటూ వేడుకున్నా కనికరించకుండా వీడియోలు తీసిన ఘటన మరువకముందే అలాంటి సంఘటన మరొకటి చోటుచేసుకున్నది. లఖింపూర్ ఖీరీలో ఓ యువకుడు తన దుకాణాన్ని మూసివేసి రూ.లక్ష తీసుకొని ఇంటికి వెళ్తుండగా కొందరు దాడి చేశారు.
డబ్బులను గుంజుకొని అతడి నాలుకను కోసేసి వెళ్లిపోయారు. దీంతో రోడ్డు మీద కుప్పకూలిన అతడు రక్షించాలంటూ ఆ మార్గంలో వెళ్లేవారిని కోరాడు. అయినా వాళ్లు స్పందించలేదు. పైగా అతడి ఫొటోలు, వీడియోలు తీయడంలో నిమగ్నమయ్యారు. పోలీసులు బాధితుడిని దవాఖానకు తరలించారు.