హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 17 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ఓపెన్ ప్లాట్ల క్రేజ్ కొనసాగుతున్నది. ఇంటి కలను నెరవేర్చుకొనేవారితో పాటు పెట్టుబడులకు సైతం ఓపెన్ ప్లాట్లు అనువుగా ఉండటంతో ఏటా అమ్మకాలు అంతకంతకూ పెరుగుతున్నాయని హౌసింగ్ డాట్కామ్ సర్వేలో తేలింది. ఇదే సమయంలో అపార్ట్మెంట్ల ఫ్లాట్ల విక్రయాల్లో పురోగతి మోస్తరుగా ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది.
దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్లో 2015 నుంచి 2021 వరకు ఓపెన్ ప్లాట్లు, అపార్టుమెంట్ల ఫ్లాట్ల విక్రయాలపై హౌసింగ్ డాట్కామ్ సర్వే నిర్వహించగా.. నగరాల పరిధిలో పరిమితమైన సంఖ్యలో ఓపెన్ ప్లాట్లు ఉండటంతో వీటిపై పెట్టుబడులు పెట్టే వారికి రాబడి గణనీయంగా వస్తుందని తేలింది. సర్వే ప్రకారం.. ఈ 8 నగరాల్లో సరాసరిన ఏడు శాతం ఓపెన్ ప్లాట్ల అమ్మకాలు పెరిగాయి. అపార్ట్మెంట్ల ఫ్లాట్ల అమ్మకాల్లో వృద్ధి కేవలం రెండు శాతానికే పరిమితమైంది. ఈ మూడేండ్లలో అమ్మకాలు దాదాపు 13-21 శాతం పెరిగాయి. అపార్ట్మెంట్ల ఫ్లాట్ల అమ్మకాలు 2-6 శాతంగా ఉన్నాయి. అపార్ట్మెంట్లలో కారు పార్కింగ్, క్లబ్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి సౌకర్యాలు ఉంటేనే కొనుగోలు చేస్తున్నట్టు సర్వేలో స్పష్టమైంది.
నివేదికలో కొన్ని ప్రధానాంశాలు