మెండోరా/ నిజాంసాగర్, జూలై 15: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ఎస్సారెస్పీలో లక్షా 28 వేల 750 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ఏఈఈ సారిక తెలిపారు. 26 వరద గేట్లు ఎత్తి దిగువకు లక్షా 2 వేల 570 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా శుక్రవారం సాయంత్రానికి 1088.00 అడుగులు (76.424 టీఎంసీలు) నీటి నిల్వ ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి శుక్రవారం సాయంత్రానికి 9800 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు ఏఈ శివకుమార్ తెలిపారు. 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) సామర్థ్యానికి 1399.60 అడుగులు (10.94 టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు