మహబూబ్నగర్: జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతున్నది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద రావడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల జలాశయానికి 10 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. ఎగువ నుంచి భారీగా నీరు వస్తుండటంతో 10,595 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు 8 గేట్లు తెరవడంతో 42,940 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో ఇవాళ సాయంత్రానికి జూరాలకు ఇంకా వరద పెరిగే అవకాశం ఉంది. జూరాల పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 6.859 టీఎంసీల నీరు నిలువ ఉన్నది.