హైదరాబాద్, అక్టోబర్ 1: ఈ పండుగ సీజన్లో కస్టమర్ల కోసం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తున్నది. గత నెల 12 నుంచే మొదలైన దసరా, దీపావళి డబుల్ ధమాకా.. ఈ నెల 25 వరకు కొనసాగనున్నది. ఈ సందర్భంగా వస్ర్తాలు, ఆభరణాలపై ఎన్నో రాయితీలతోపాటు రూ.6 కోట్ల విలువ చేసే బహుమతులనూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తమ కస్టమర్లకు ఇస్తున్నది. దసరా (బుధవారం), దీపావళి (25వ తేదీన)రోజుల్లో బంపర్ డ్రాలు ఉంటాయని కూడా శనివారం ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది. విజేతలకు 50 మారుతీ సుజుకీ ఎస్ ప్రెస్సో కార్లు, 130 బైక్వో ఎలక్ట్రిక్ బైకులు, 100 వెండి ప్లేట్లు, 1,140 ఇండక్షన్ స్టౌలు, 480 ట్యాబ్లు ఇంకా ఎన్నో కానుకలుంటాయని ఈ సందర్భంగా సంస్థ వివరించింది.