వేములవాడ రాజన్న క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. సుమారు 30 వేలకు పైగా రావడంతో ఎటుచూసినా భక్తజన సందోహం కనిపించింది.
వేములవాడ టౌన్, అక్టోబర్ 7 : వేములవాడ రాజన్న ఆలయం శుక్రవారం భక్తులతో పోటెత్తింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి బారులు తీరి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించారు. కోడె, కల్యాణ మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్నను దాదాపు 30 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.