రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్తో గుజరాత్, మధ్యప్రదేశ్ రైతులు, వ్యాపారుల భేటీ
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యానశాఖ దేశంలోనే మొట్టమొదటిసారిగా తయారు చేసిన వెదురు గుళికలపై ఇతర రాష్ర్టాల రైతులు, వ్యాపారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆదివారం మధ్యప్రదేశ్, గుజరాత్ వ్యాపారులు, రైతులు రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డితో భేటీ అయ్యారు.
వెదురు గుళికల తయారీ, లాభాలు, వినియోగం, వెదురు సాగు అంశాలపై చర్చించారు. గుజరాత్కు చెందిన చిరాగ్ సుజయ్ బాంబే రైతు శిక్షణా కేంద్రం, మధ్యప్రదేశ్కు చెందిన సిర్సాట్ కంపెనీ వాళ్లు వెయ్యి టన్నుల గుళికలు కావాలని కోరారు. అనంతరం వీరంతా శ్రీరాంపూర్లో వెదురు తోటను, గుళికల తయారీ మిషన్ విధానాన్ని పరిశీలించారు.