న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్పై ఇవాళ లోక్సభలో చర్చ జరిగింది. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ.. రైల్వే బడ్జెట్కు 1.1 లక్ష కోట్లు కేటాయించారని, రైల్వేల ద్వారా 2.7 కోట్ల ఆదాయం తేవాలని అంచనా వేస్తున్నారని, అయితే అంత ఆదాయాన్ని ఎలా జనరేట్ చేస్తారో వివరంగా చెప్పాలంటూ ఎంపీ నామా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైల్వే ప్రైవేటీకరణతో ఇది సాధ్యమవుతుందా, డిటేల్గా చెప్పండి అని ఎంపీ ప్రభుత్వాన్ని అడిగారు. దేశవ్యాప్తంగా రైల్వే నెట్వర్క్ ఇంప్రూవ్ అవుతోందని, ఇందులో డౌట్ లేదని. కానీ ఆ స్పీడ్.. ప్రజల ఆశయాలకు తగినట్లు లేదన్నారు. గత 20 ఏళ్లను పరిశీలిస్తే.. రైల్వే నెట్వర్క్పై దేశమంతా ఆధారపడి ఉందని, వాజపేయి రోడ్డు నెట్వర్క్ను ఇంప్రూవ్ చేశారని. కానీ రైల్వే వ్యవస్థ కాలేదన్నారు.
భద్రాచలం-కొవ్వూరు రైల్వేలైన్ మార్గం డెవలప్ చేయలేదన్నారు. రామ మందిరం ఉన్న భద్రచలం ఊరికి రైల్వే రూటు వేయలేదన్నారు. ఎన్ని సార్లు కోరినా రైల్వే ట్రాక్ వేయడం లేదన్నారు. రామ మందిరం ఉన్న భద్రాచలంకు మార్గం వేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర విభజన తర్వాత కొవ్వురుతో కనెక్టివిటీ ఆగిపోయిందన్నారు. తెలుగు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. స్టేట్ డివిజన్లో ఉన్న రీఆర్గనైజేషన్ యాక్ట్ హామీలను నెరవేర్చాలని కోరారు.
కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి..
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. కానీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదన్నారు. కోచ్ ఫ్యాక్టరీని ఇచ్చేందుకు పార్లమెంట్ అగ్రీ చేసిందని, ప్రభుత్వం ఆ ఒప్పందం అమలు చేయాలి. యాక్ట్ చేసిన తర్వాత అమలు కాకుంటే.. ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోతాం. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలి. కచ్చితంగా ఇవ్వాలి. బడ్జెట్లో దాన్ని మెన్షన్ చేయాలని ఎంపీ నామా తెలిపారు. రైల్వే లైన్ల గురించి ప్రస్తావిస్తూ.. పఠాన్చెరువు, సంగారెడ్డి, భువనగిరి, నిజామాబాద్, బోధన్, బీదర్ మార్గాల్లో విస్తరణ కోసం బడ్జెట్ లో ఏమీ కేటాయించలేదన్నారు. కొత్త రాష్ట్రానికి కేటాయింపులు కల్పించండి.. అంటూ ఎంపీ నామా కోరారు.
ఖమ్మంలో ఏడు నియోజకవర్గాలు వెనుకబడి ఉన్నాయని, ఖమ్మం రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ పెంచాలని కోరామన్నారు. స్టేషన్లో కెమెరాలు ఏర్పాటు చేయండి. ఎంపీ ల్యాడ్స్ రెండేళ్లు లేవన్నారు. ఆర్వోబీ, ఆర్యూబీలను పూర్తి చేయాలని అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వ ఫండ్స్తో ఆర్వోబీ గేట్లను పూర్తి చేయాలన్నారు. అనుమతి ఇస్తున్నారు.. కానీ డబ్బులు ఇవ్వడం లేదన్నారు. మరి పనులు ఎలా జరుగుతాయని నామా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పునర్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చండి అంటూ లోక్సభలో నామా ప్రభుత్వాన్ని కోరారు.