హైదరాబాద్, ఆగస్టు : డెంగీ జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా ప్లేట్లెట్స్ క్షీణిస్తుంటాయి. ఆసమయంలో రక్తంలో ఉన్న వాటి సంఖ్య ఒకేసారి పడిపోతుంది. దీంతో ఆరోగ్యం మరింత విషమించి ప్రాణాలుకూడా కోల్పోయే ప్రమాదం ఉన్నది. అలాంటి జ్వరం వచ్చినప్పుడు వైద్యులు ఇచ్చే మందులతోపాటుగా కొన్నిరకాల పండ్లు, ఇతర ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ప్లేట్లెట్ల సంఖ్యనుపెంచుకోవచ్చు.
-ఎండు ద్రాక్షల్లో 30 శాతం ఐరన్ ఉంటుంది. ఇది ప్లేట్లెట్ల సంఖ్యను పెంచుతుంది.
-ఆప్రికాట్ పండ్లను నిత్యం రెండు సార్లు తీసుకున్నా చాలు. రక్తం వృద్ధి చెంది ప్లేట్లెట్లు పెరుగుతాయి.
-ఎండు ఖర్జూరం, కివీ పండ్లను తింటున్నాప్లేట్లెట్లను బాగా పెంచుకోవచ్చు. దీంతో వ్యాధి తగ్గుముఖం పడుతుంది.
-బొప్పాయి పండ్లను తీసుకోవడం వల్ల డెంగీ వచ్చిన వారు త్వరగా కోలుకుంటారు. అంతేకాదు బొప్పాయి ఆకు రసం తీసుకున్నా ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది.
-దానిమ్మ పండ్లను తిన్నా ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఇది రక్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఉపయోగపడుతుంది.
-ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, కూరగాయలను ఎక్కువగా తినాలి. దీంతో వాటిలో ఉండే విటమిన్ కె ప్లేట్లెట్ల సంఖ్యను పెంచుతుంది.
-వెల్లుల్లి రేకుల్ని ఆహారంలో భాగంగా తీసుకుంటే చాలా మంచిది. దీంతో ప్లేట్లెట్ల సంఖ్య వృద్ధి చెందుతుంది.
-రక్తహీనతతో బాధపడేవారే కాదు, డెంగీ వచ్చిన వారు కూడా బీట్ రూట్ జ్యూస్ను తాగవచ్చు. దీంతో ప్లేట్లెట్లు పెరుగుతాయి.
-క్యారెట్ను తరచూ తింటున్నా రక్తం వృద్ధి చెంది తద్వారా ప్లేట్లెట్లు పెరుగుతాయి.