కావలసిన పదార్థాలు: మునగాకు: కప్పు, మెంతి ఆకులు: కప్పు, తోటకూర: కప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు, పచ్చిమిర్చి ముద్ద: రెండు చెంచాలు, కారం: చెంచా, ఉప్పు: తగినంత, శనగ పిండి: కప్పు, బియ్యప్పిండి: అరకప్పు, కరివేపాకు రెబ్బలు: రెండు, నూనె: వేయించడానికి సరిపడా, ధనియాల పొడి: రెండు చెంచాలు
తయారీ విధానం: ముందుగా మునగాకు, మెంతి ఆకులు, తోటకూర, కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. పిండి మరీ పొడిగా ఉంటే కొద్దిగా నీళ్లు చల్లుకోవచ్చు. బాణలిలో నూనె వేడి చేసి పకోడీలా వేసుకోవాలి. మంట తగ్గించి, ఎర్రగా వేయించి తీసుకుంటే సరి. వేడివేడి పకోడీ రెడీ.