ఓ గుర్రం రేసులో పాల్గొంది. తీవ్రంగా అలిసిపోయింది. ఆ ప్రాంతం నుంచి మళ్లీ పరిగెత్తించడం ఎందుకు? గుర్రానికి కష్టమవుతుందని అనుకున్నాడో…. లేదా.. గుర్రానికీ రైల్ ప్రయాణం అలవాటు చేయిద్దామని భావించాడో గానీ… ఆ యజమాని పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన కోల్కతాలో జరిగింది. గఫూర్ అలీ (40) తన గుర్రంతో సహా లోకల్ ట్రైన్లో ప్రయాణించారు. దక్షిణ్ దుర్గాపూర్ అనే ప్రాంతం నుంచి నేత్రా అన్న ప్రాంతానికి తన గుర్రంతో సహా ప్రయాణించాడు. ఇప్పడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే.. ఈ ఫొటోలు తెగ వైరల్ అవ్వడంతో ఆర్పీఎఫ్ పోలీసులు గఫూర్ అలీని అరెస్ట్ చేశారు. రైల్వే చట్టాల ప్రకారం అతనిపై కేసులు నమోదు చేశామని రైల్వే అధికారి ఏకలవ్య చక్రవర్తి వెల్లడించారు. జంతువులు ప్రయాణికులు ఉండే కంపార్ట్మెంట్లోకి రావొద్దని, వాటి కోసం ప్రత్యేకమైన వ్యవస్థ ఉందని, దీనిని తెలుసుకోకుండానే ఆయన ఏకంగా గుర్రాన్ని కంపార్ట్మెంట్లోకి ఎక్కించారని ఆ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఇష్టారీతిన గుర్రాన్ని ఎక్కించడం వల్లే కేసు నమోదు చేశామని రైల్వే అధికారి ఏకలవ్య పేర్కొన్నారు.