కోల్కతా, ఏప్రిల్ 9: బెంగాల్కు చెందిన గఫూర్ అలీముల్లాకు ఓ గుర్రం ఉంది. అదంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఇటీవల ఆ గుర్రాన్ని సొంతూరు నేత్ర నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ దుర్గాపూర్కు రేసుల కోసం తీసుకెళ్లాడు. రేసుల్లో తన గుర్రం బాగా అలసిపోయిందని, మళ్లీ ఇంటిదాకా పరుగెత్తాలంటే దాని కాళ్లు నొప్పి పెడతాయని భావించి ఓ రైలు ఎక్కించాడు. దీన్ని అదే రైలులో ఉన్న ప్రయాణికుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఫొటో వైరల్ అయింది. ఆర్పీఎఫ్ దృష్టికి వెళ్లింది. చట్టాన్ని ఉల్లంఘించిన గఫూర్ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.