హైదరాబాద్: హోలీ (Holi) సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. రాజధానిలో బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలు నిర్వహించడంపై నిషేధం విధించారు. పరిచయం లేనివారిపై రంగులు వేయ్యకూడదని, వాహనాలు, భవనాలపై కలర్లు పోయకూడదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రంగుల పండుగ నేపథ్యంలో రెండు రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు మూతపడనున్నాయి. గురువారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు మద్యం దుకాణాలు, బార్లు బంద్ చేయనున్నారు. జంట నగరాల పరిధిలో 48 గంటల పాటు ఆంక్షలు అమలు ఉంటాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు.