హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుడి పోస్టు మంజూరుకు కృషిచేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హామీ ఇచ్చారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) సమస్యలను సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ఎస్జీటీ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరివేద మహిపాల్రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం హైదరాబాద్లో ఆయనకు వినతిపత్రం సమర్పించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఎస్జీటీలకు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించేందుకు ప్రభుత్వంతో మాట్లాడతానని వినోద్ భరోసా ఇచ్చారు.