న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని హిందూ కళాశాలలో పని చేస్తున్న ఓ ప్రొఫెసర్ కరోనా బారినపడి మృతి చెందారని ప్రిన్సిపాల్ డాక్టర్ అంజు శ్రీవాస్తవ పేర్కొన్నారు. జువాలజీ ప్రొఫెసర్గా పని చేస్తున్న డాక్టర్ సీఎల్ జోన్వాల్ (43) కరోనాతో ఎయిమ్స్లో మృతి చెందినట్లు తెలిపారు. ఆయన గత మార్చి 30న అసోసియేట్ ప్రొఫెసర్గా ఎన్నికయ్యారని చెప్పారు. ఆయనకు భార్య, కుమార్తె (12), ఐదేళ్ల కుమారుడు ఉన్నారని పేర్కొన్నారు. జోన్వాల్ కళాశాలలో కొవిడ్-19 టాస్క్ఫోర్స్లో కీలక సభ్యుడని, అతని సహచరుల్లో చాలా మందికి ఆసుపత్రిల్లో పడకలు, ఆక్సిజన్ అందించేందుకు కృషి చేశారని చెప్పారు.
2006లో కళాశాలలో చేశారని తెలిపారు. కరోనా బారినపడిన ఆయనకు ఎయిమ్స్లో బెడ్ ఏర్పాటు చేయించామని, అంతకు ముందు అల్వార్లోని హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్ 29న వైరస్కు పాజిటివ్గా పరీక్షించారని, ఆ తర్వాత ఇంట్లో ఐసోలేషన్ ఉన్నారని.. శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఈ నెల 10న అల్వార్లోని హాస్పిటల్లో చేరారని చెప్పారు. అక్కడ పరిస్థితి మరింత దిగజారిందని, ఆ తర్వాత ఎయిమ్స్కు తరలించగా మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 35 మంది అధ్యాపకులు వైరస్కు పాజిటివ్గా పరీక్షలు చేసినట్లు తెలిపారు. అయితే, జోన్వాల్ భార్యకు సైతం కరోనా సోకిందని, ఆమె కోలుకుందని డాక్టర్ శ్రీవాస్తవ తెలిపారు.